భారతదేశం, ఏప్రిల్ 10 -- సెల్ఫీ సరదాకు ముగ్గురు మైనరల్ బాలికల ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. సరదాగా వాటర్ ఫాల్స్ లో దిగి అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ బాలికలు. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. లోతును అంచనా వేయకపోవటంతో. ఉన్నట్టుండి నీళ్లలోకి జారుకుని దుర్మరణం చెందారు.

ప్రాథమిక వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మూలగుమ్మి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మైనర్ బాలికలు వేసవి సెలవుల నిమిత్తం సొంతూరుకు వచ్చారు. అయితే జలపాతం దగ్గర సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లారు.

జలపాతంలో కాసేపు నీళ్లలో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలతో సరదాగా గడిపారు. అంతలోనే ఒక అమ్మాయి నీళ్ల లోపలికి జారుకుంది. ఆ తర్వాత మరో ఇద్దరు ఆమెను కాపాడడానికి వెళ్లి వాళ్ళు కూడా మునిగిపోయారు. మరో ఇద్దరు బయటనే ఉండగా.. వాళ్ల...