భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ - SATG) ఇటీవల సవరించిన క్రీడా కోచింగ్ ఫీజుల నిర్మాణంపై పునరాలోచనలో పడింది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాల ఆధారంగా ఈ ఫీజుల నిర్మాణాన్ని సమీక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఎస్‌ఏటీజీ ఛైర్మన్ కే శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. సోనిబాలా దేవి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ముల్యాంకన నిర్ణయాన్ని తీసుకున్నారు. సవరించిన ఫీజులపై తలెత్తిన వివాదంపై ఎస్‌ఏటీజీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం శిక్షణ పొందుతున్న వారిలో 42 శాతానికి పైగా క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ లభిస్తుందని వివరి...