భారతదేశం, మే 6 -- అర్ధరాత్రి సమయంలో మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్ చేపట్టారు. యూనిఫామ్ వెనక ఉన్న సామాన్య మహిళా వేదనను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన భద్రత సాధ్యమని నిరూపించారు మల్కాజ్‌గిరి కొత్త కమిషనర్ సుమతి. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆమె క్షేత్రస్థాయిలో మహిళల భద్రతను పరీక్షించేందుకు రంగంలోకి దిగారు.

అర్ధరాత్రి సమయం.. అందరూ నిద్రపోతున్న వేళ, నగరంలోని ఒక బస్టాండ్‌లో ఒక సామాన్య మహిళ ఒంటరిగా నిలబడి ఉన్నారు. ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ దుస్తుల్లో ఆమె బస్టాండ్‌లో నిల్చున్నారు. ఒక సీపీగా కాకుండా, రక్షణ కోరుకునే ఒక సగటు మహిళగా అక్కడ ఎదురయ్యే పరిస్థితులను స్వయంగా అనుభవించాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

అక్కడ నిల్చున్నది పోలీస్ అధికారి అని తెలియని కొందరు ఆకతాయిలు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. చూస్తుండగానే సుమారు 40 మంది పోకి...