భారతదేశం, ఆగస్టు 6 -- తెలంగాణ, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో న్యూఢిల్లీలో సౌజన్యపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతికత, పరిశోధన రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు ఎదురవుతున్న వీసా సమస్యలను ముఖ్యమంత్రి రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల వీసాల సంఖ్యను పెంచాలని, సమయానికి ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను పెంచి, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే అమెరికాలో వివిధ రంగాల్లో పనిచే...