భారతదేశం, ఆగస్టు 3 -- అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా నిప్పులు చెరిగిన ముడిచమురు ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభమవుతున్నాయనే వార్తలతో సోమవారం ఆసియా మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు 7 శాతానికి పైగా కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84 డాలర్ల కంటే దిగువకు రాగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 81 డాలర్ల దిగువన ట్రేడవుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైమానిక దాడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే ఈ మార్కెట్ మార్పునకు ప్రధాన కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్‌పై ప్లాన్ చేసిన భారీ మిలిటరీ దాడిని రద్దు చేసినట్లు ప్రకటించారు. సౌదీ అరేబియా సహా మధ్యప్రాచ్యంలోని మిత్రదేశాలు యుద్ధం కంటే దౌత్యానికే ప్రాధాన్యమివ్వాలని వ...