భారతదేశం, మే 18 -- Telangana Student Killed US : ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును అందుకుంటుందని ఆశించిన ఆ ఇంటి కుమార్తె అమెరికా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందింది. మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) చదివేందుకు అమెరికా వెళ్లిన నవ్య (24) అనే విద్యార్థిని శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.నవ్య. తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన నివాసి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... నవ్య రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్ళింది. శనివారం రాత్రి ఆమె తన పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ దారుణమైన ప్రమాద వార్తను అమెరికాలో ఉంటున్న నవ్య స్నేహితులు మొదటగా నల్...