భారతదేశం, మే 1 -- మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు అయతుల్లా మోజ్తబా ఖమేనీ.. తొలిసారిగా అమెరికాపై నిప్పులు చెరిగారు. తమ దేశ అణ్వాయుధ ప్రాజెక్టులు, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు "జాతీయ ఆస్తులు" అని, వాటి విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. పర్షియన్ గల్ఫ్ డే సందర్భంగా గురువారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళ ఉనికిపై మోజ్తబా అత్యంత కటువైన పదజాలాన్ని ఉపయోగించారు. "పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు చోటు ఉందంటే.. అది కేవలం ఆ సముద్రపు అడుగున మాత్రమే" అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికా బలగాలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లకపోతే వారిని నా...