అమర్నాథ్ యాత్ర 2026: జూలై 3 నుంచి మహా పుణ్యయాత్ర.. మంచు లింగం మహిమ ఇదే!
భారతదేశం, జూన్ 29 -- ప్రకృతి ఒడిలో వెలసిన స్వయంభూలింగం.. కఠినమైన కొండకోనలు దాటి భక్తి పారవశ్యంతో సాగే ప్రయాణం. ప్రతి ఏటా కోట్లాది మంది శివ భక్తులు తహతహలాడే అమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు కన్నుల పండుగగా మారనుంది.
ఈ ఏడాది మొత్తం 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్ 15 నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో, భక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో, సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహను చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ, "హర హర మహాదేవ" నామస్మరణతో భక్తులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ బాబా దర్శనం కోసం తరలివస్తారు.
అమర్నాథ్ గుహలో నెలకొనే మంచు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.