భారతదేశం, ఏప్రిల్ 1 -- ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌ 2 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్‌ 5(2)కి సవరణ చేస్తూ రూపొందించిన బిల్లును హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ప్రవేశపెట్టారు.

లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభ ముందుకు వస్తుంది. ఈ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. ఏపీ పునర్‌ విభజన సందర్భంగా ఏపీకి అనేక హామీలు ఇచ్చిన విషయాన్ని లేవనెత్తారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్దికి సంపూ...