భారతదేశం, మార్చి 16 -- పొట్టి శ్రీరాములుకు ఘన నివాళిగా అమరావతిలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విగ్రహ ఆవిష్కరణను చేశారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు ఆ ఉద్యమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారు. కొత్తగా ప్రతిష్టించిన ఈ విగ్రహం ఆయన చారిత్రక పోరాటాన్ని, ఆశయం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. పొట్టి శ్...