భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘర్షణల మధ్య అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అతని తల్లిదండ్రులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్.రాజేశ్వరరావు ఈ సంఘటనలో గాయపడ్డారని అతని తండ్రి ప్రభాకర్ రావు తెలిపారు.
విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. తాను, అనేక మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
'నా కొడుకు ఒక సంవత్సరంగా అక్కడ పనిచేస్తున్నాడు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. వీడియో కాల్ ద్వారా మాతో మాట్లాడాడు. కానీ మాకు గాయాలను చూపించడం లేదు. నా కొడుకు త్వరగా ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.