భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘర్షణల మధ్య అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అతని తల్లిదండ్రులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్.రాజేశ్వరరావు ఈ సంఘటనలో గాయపడ్డారని అతని తండ్రి ప్రభాకర్ రావు తెలిపారు.

విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. తాను, అనేక మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

'నా కొడుకు ఒక సంవత్సరంగా అక్కడ పనిచేస్తున్నాడు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. వీడియో కాల్ ద్వారా మాతో మాట్లాడాడు. కానీ మాకు గాయాలను చూపించడం లేదు. నా కొడుకు త్వరగా ఇ...