భారతదేశం, ఫిబ్రవరి 11 -- బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌ రూ. 9 కోట్ల అప్పు కేసులో తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలుసు కదా. ఈ విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ అతనికి అండగా నిలిచింది. "నాకు ఎవరూ లేరు" అని అతడు ఎమోషనల్ అయిన వేళ.. సోనూ సూద్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఎవరు ఎంత సాయం చేశారో ఇక్కడ చూడండి.

"నాకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరూ లేరు.." అంటూ జైలుకు వెళ్లే ముందు ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ చేసిన కామెంట్స్ అందరినీ కలిచివేశాయి. రూ. 9 కోట్ల అప్పు ఎగ్గొట్టారన్న కేసులో అతడు తీహార్ జైలులో లొంగిపోవాల్సి వచ్చింది. అయితే అతడు కష్టాల్లో ఉన్నాడని తెలియగానే బాలీవుడ్ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చింది.

రాజ్‌పాల్ యాదవ్‌కు మద్దతుగా మొదట గళం విప్పింది రియల్ హీరో సోనూ సూద్. ఇండస్ట్రీ అంతా అతనికి సాయం చేయాలని పిల...