భారతదేశం, జూలై 24 -- కోర్టు విచారణల వీడియోలను క్లిప్ చేసి, ఎడిట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వినోదం కోసం ఉపయోగించడం, వాటి ద్వారా ఆదాయం పొందడం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా న్యాయస్థానాల ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

"సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా న్యాయపరమైన విచారణల ఆడియో/వీడియో రికార్డింగ్‌లను ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఎక్స్‌ట్రాక్ట్ చేయడం, సవరించ...