Telangana,kamareddy, ఆగస్టు 27 -- అతి భారీ వర్షాల దాటికి కామారెడ్డి జిల్లా అతలాకుతలమవుతోంది. జోరుగా కురుస్తున్న వానల దాటికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో రహదారుల మీదుగా వరద ఏరులై పారుతోంది.కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డు కోతకు గురై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది.

కామారెడ్డి పట్టణంలోని చాలా కాలనీలలోకి వరద నీరు భారీగా చేరుతోంది. బిక్కనూర్ మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి. రికార్డు స్థాయిలో కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....