భారతదేశం, ఏప్రిల్ 7 -- అన్నమయ్య జిల్లాలోని బోయకొండ కొండ సమీపంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడు అడవిలో నుంచి వణుకుతూ బయటకు వచ్చాడు. అతడి భయం చూసి అడగ్గా.. దారుణమైన విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. బాలుడు ధైర్యంగా తప్పించుకోవడంతో తండ్రి హత్య వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడుకు చెందిన గాంధీ, అతని భార్య.. చౌడేపల్లె మండలం, ఆర్ఆర్ కాలనీలోని ఒక కోళ్ల ఫారంలో పని చేసేవారు. గాంధీ భార్యతో నరసింహులు అనే వ్యక్తికి వివాహేతర సంబందం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయం గాంధీకి కూడా తెలుసని చెబుతున్నారు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు.

కానీ ఆదివారం రాత్రి (ఏప్రిల్ 5, 2026) కొండ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో నరసింహులు మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి గాంధీని కూడా పిలిచాడు. అయితే నరసింహులు ముందుగానే పథక...