భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఆన్​లైన్ ఫుడ్ సర్వీస్ దిగ్గజం జొమాటో నుంచి కస్టమర్లకు ఊహించని, ఆశ్చర్యకరమైన షాక్ ఎదురైంది! ఇకపై డెలివరీ సమయంలో నగదు రూపంలో (క్యాష్ ఆన్ డెలివరీ - సీఓడీ) చెల్లింపులు చేస్తే అదనపు ఫీజు వసూలు చేస్తామని సంస్థ తెలిపింది. అంటే.. ఆన్​లైన్ పేమెంట్స్ బదులు జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే.. అదనంగా డబ్బు ఖర్చు అవుతుందని అర్థం!

ఆర్డర్ తీసుకెళ్లినప్పుడు డెలివరీ బాయ్‌కు నేరుగా నగదు ఇచ్చే వినియోగదారుల బిల్లులో 'పే ఆన్ డెలివరీ ఫీజు' పేరిట ప్రత్యేక రుసుమును జొమాటో జోడిస్తోంది. యూజర్, ఆర్డర్ విలువను బట్టి ఈ చార్జీలు మారుతున్నాయి. కస్టమర్లను డిజిటల్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ల వైపు మళ్లించేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

జొమాటో ప్రధాన పోటీదారు స్విగ్గీ.. ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై ఎలాంటి అదన...