భారతదేశం, జూలై 10 -- భారతదేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్యను, ముఖ్యంగా యువతను మ్యూచువల్ ఫండ్స్ వైపు నడిపించడంలో డిస్కౌంట్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషించాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో సైతం ఐటీ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు లక్షలాది మంది ఈ యాప్స్ ద్వారానే ప్రతి నెలా 'సిప్' రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా వెలుగొందుతున్న జెరోధా, గ్రో సంస్థల మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యాపార యుద్ధం మొదలైంది! మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో "డైరెక్ట్ ప్లాన్స్ మాత్రమే ఉండాలా.. లేక కమీషన్ వచ్చే రెగ్యులర్ ప్లాన్స్ కూడా అవసరమా?" అనే అంశంపై ఇరు కంపెనీల అధినేతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాహాబాహీకి దిగారు.

జెరోధా వ్యవస్థాపకుడు, సీఈ...