భారతదేశం, మార్చి 8 -- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. దేశ రాజధానిలోని నెహ్రూ పార్క్ నుంచి విడుదల చేసిన ఒక వీడియోలో, ఆయన దేశంలోని ఐదు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారనే అంశాన్ని విశ్లేషించారు.

"డీఎంకెలో 13%, బీజేపీలో 15%, ఎస్పీలో 16%, కాంగ్రెస్‌లో 16% మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కానీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు 33 శాతం కావాలని చెబుతోంది. కానీ ఆ బిల్లు లేకపోయినా మా పార్టీలో అంతకంటే ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారు. వెస్ట్ బెంగాల్.. బెస్ట్ బెంగాల్" అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో పో...