భారతదేశం, ఏప్రిల్ 29 -- Watermelon side effects : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనమందరం పుచ్చకాయను ఆశ్రయిస్తాం. అమృతంలా అనిపించే ఈ పండు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందా? ముంబైలో ఇటీవల జరిగిన ఒక విషాద ఘటన ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రాత్రి భోజనంలో బిర్యానీ తిని, ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు. కొద్ది గంటల్లోనే వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. వారికి అసలేం జరిగింది? అనే అంశంపై వైద్య నివేదికలు రావాల్సి ఉన్నప్పటికీ, రాత్రి పూట పండ్లు తినే అలవాటుపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ అది తినే సమయం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏ రకమైన పండ్లు తీసుకోకపోవడమే మంచిదన...