భారతదేశం, మార్చి 15 -- విశాఖపట్నం నగర పట్టణాభివృద్ధికి హడ్కో సహకారం ప్రాముఖ్యతను మంత్రి నారాయణ నొక్కిచెప్పారు. స్థానిక కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొన్నారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని, రైడర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న అధ్యయనం రెండు నెలల్లో ముగుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఒకటి రెండు నెలల్లో కేంద్రం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ స్ఫూర్తితో విశాఖపట్నం కోసం సెమీ-రింగ్ రోడ్డు ప్రణాళికలను ఆయన ప్రకటించారు. దీనిపై వీఎంఆర్డీఏ అధ్యయనం చేస్తోందన్నారు. VMRDA రాంబిల్లి-భోగాపురం ప్రాజెక్టును పరిశీలిస్తోందని చెప్పారు. మాస్టర్ ప్లాన్ మార్గంలో రోడ్డు నిర్మించడానికి అటవీ భూమి గతంలో అడ్డంకిగా ఉందని, అయితే ముఖ్యమంత...