భారతదేశం, ఫిబ్రవరి 25 -- విరోష్ వెడ్డింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ఉదయ్‌పూర్‌ లో ఈ జంట వివాహ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన సంగీత్ లో కాబోయే కోడలికి విజయ్ దేవరకొండ అమ్మ మాధవి అపురూమైన బహుబతి అందించిందని తెలిసింది. తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను కాబోయే కోడలికి అత్తగారు ప్రజెంట్ చేశారని సమాచారం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో గ్రాండ్ గా జరగబోతుంది. అంతకంటే ముందు ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్వహించిన సంగీత్ లో రష్మికకు మాధవి దేవరకొండ తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను బహుమతిగా ఇచ్చారని తెలిసింది.

సంగీత్ వేడుకలో రష్మికకు మాధవి బంగారు గాజులు ఇవ్వ...