భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఇన్ని రోజులు లవ్ బర్డ్స్ గా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. విరోష్ జంట గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహిత వేడుకలో మూడు ముళ్లు, ఏడడుగులతో వివాహ బంధాన్ని పెనవేసుకుంది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకుంది.

విరోష్ వెడ్డింగ్

అభిమానులు 'విరోష్' అని ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట పెళ్లి గురువారం ఉదయం ఉదయ్‌పూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని ఐటీసీ మొమెంటోస్‌లో జరిగింది. ఉదయం 10.10 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం విరోష్ వెడ్డింగ్ జరిగింది.

స్వీట్లు పంచి

విరోష్ వెడ్డింగ్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ టీమ్ మెంబర్స్ కన్ఫామ్ చేశారు. పెళ్లి ముగిసిన తర్వాత ఐటీటీ మెమెంటోస్ బయటకు వ...