భారతదేశం, జూన్ 1 -- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టును 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడొవ జట్టుగా రజత్ పటిదార్ సేన రికార్డు సృష్టించింది.

గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. లీగ్‌లోకి అడుగుపెట్టిన 19 ఏళ్ల తర్వాత తన కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన ఐపీఎల్ హాఫ్ సెంచరీ (25 బంతుల్లో) బాదిన కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక...