భారతదేశం, సెప్టెంబర్ 13 -- వినాయక చవితి శోభతో దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈసారి చవితి వేడుకల్లో ఒక అద్భుతమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో, వినాయక విగ్రహాల ఎంపికలో ప్రజలు మట్టి, సీడ్ గణపతులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' పిలుపుతో పర్యావరణ ఉద్యమం మరింత ఊపందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కథానాయిక పూజా హెగ్డే వంటి ప్రముఖులు ఈ 'సీడ్ గణేష్' ప్రతిమలను స్వీకరించి, తమ అభిమానులను సహజసిద్ధమైన మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు.

క్యాంపెయిన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంటూ, ప్రతి ఒక్కరూ ప్రకృతికి హాని చేయని మట్టి గణపతులను మాత్రమే ఇంట్లోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చా...