భారతదేశం, జూలై 24 -- Vijayashanti: టాలీవుడ్ 'లేడీ అమితాబ్' విజయశాంతి (Vijayashanti) తన సినీ ప్రయాణంలో ఎదురైన ఊహించని అనుభవాలను బయటపెట్టి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. తన తొలి సినిమా పారితోషికంలో కొంత డబ్బును నిర్మాతలు ఎగ్గొట్టారని, అయినా పట్టు వదలకుండా పోరాడి బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న నటిగా చరిత్ర సృష్టించానని ఆమె వెల్లడించారు.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించిన ఏకైక నటి విజయశాంతి. ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన షాకింగ్ సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.

తొలి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నిర్మాతలు రూ. 5,000 పారితోషికం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే చివరకు తన చేతిలో కేవలం రూ. 3,000 మాత్రమే పెట్టారని, మిగ...