భారతదేశం, జూలై 3 -- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకలకు మార్గం మాత్రమే కాదు, అది సానుకూల శక్తిని లోపలికి రప్పించే ద్వారం. ప్రవేశ ద్వారం శుభ్రంగా, దోషరహితంగా ఉంటేనే ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ రోజుల్లో వాస్తు నిపుణులు సూచిస్తున్న ఒక చిన్న, ప్రభావవంతమైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటికి ముఖద్వారమే ముఖచిత్రం. వాస్తు ప్రకారం, ప్రధాన ద్వారం వద్ద నెగటివ్ ఎనర్జీ పేరుకుపోతే కుటుంబ సభ్యుల మధ్య అనవసర గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే పురాతన కాలం నుంచి ప్రవేశ ద్వారాలను గడపతో నిర్మించి, పసుపు, కుంకుమలతో అలంకరించడం మన సంప్రదాయం. ఈ క్రమంలో 'పసుపు నీళ్ల' చిలకరింపు అనేది ఒక శక్తివంతమైన వాస్తు పరిహారంగా ప్రాచుర్యంలో ఉంది.

హిందూ ధర్మంలో పసుపును అత్యంత పవిత్రమైనదిగా, శుభసూచకంగా భావిస్తారు. ఇది కేవ...