భారతదేశం, జూన్ 11 -- varalaxmi sarathkumar: పోలీస్ కంప్లైంట్ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి వర్సెస్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా సినిమా విడుదల కావడానికి కొన్ని గంటల ముందు 'పోలీస్ కంప్లైంట్' చిత్ర యూనిట్ ఫిలిం ఛాంబర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి కౌంటర్ గా వరలక్ష్మి పెట్టిన పోస్టు మరింత సంచలనంగా మారింది.

విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ''మొరిగే కుక్కలు కరవవు. కరిచే కుక్కలు మొరగవు. నేను మొరగను.. కరుస్తాను'' అని వరలక్ష్మి ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టు కలకలం రేపుతోంది. పోలీస్ కంప్లైంట్ మూవీ టీమ్ చేసిన కామెంట్లకు కౌంటర్ గానే వరలక్ష్మి ఈ పోస్టు పెట్టిందనే కామెంట్లు వస్తున్నాయి.

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చ...