భారతదేశం, జూన్ 18 -- ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్.. తన కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. యూఎస్ ఫెడ్ తన ఫెడరల్ ఫండ్స్ రేట్లను 3.50%-3.75% శ్రేణిలోనే, యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు ద్రవ్యోల్బణాన్నిఅదుపులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫెడ్ పాలసీ మేకర్లు ఈ నిర్ణయానికి వచ్చారు. వరుసగా నాలుగో సమీక్షా సమావేశంలోనూ ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకపోవడం గమనార్హం.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడానికి అమెరికా కేంద్ర బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడ్ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది.

అయితే ఇదే సమయంలో ఫెడ్ అధికారులు విడుదల చేసిన తాజా 'సమ్మరీ ఆఫ్ ...