భారతదేశం, మే 15 -- Trisha Vijay: చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ వద్ద శుక్రవారం (మే 15) ఒక ఆసక్తికరమైన సీన్ కనిపించింది. తన తాజా మూవీ 'కరుప్పు' (Karuppu) ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వచ్చిన నటి త్రిష కృష్ణన్.. అక్కడ తనపై అభిమానులు కురిపించిన ప్రేమికి మురిసిపోయారు. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షో ముగిసిన తర్వాత త్రిష తన కారులో బయలుదేరుతుండగా అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఒక అభిమాని గట్టిగా.. "మేడమ్, తలపతి (దళపతి విజయ్)ని అడిగానని చెప్పండి" అని అనగానే.. త్రిష మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. నవ్వుతూ, సిగ్గుపడుతూ "కచ్చితంగా (Kandipa)" అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత తన ఫోన్ చూసుకుంటూ తల దించుకుని నవ్వుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగ...