భారతదేశం, ఆగస్టు 7 -- ఈవీ రంగంలోకి సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ 'ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ' (E3 Electric.AI) అడుగుపెట్టింది. భారత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్​​ 'ట్రయాన్'ని బెంగళూరు వేదికగా విడుదల చేసింది. ఈ లైనప్‌లో సీ1ఎక్స్ వేరియంట్ ధర రూ. 1,09,999 కాగా, టాప్ మోడల్ సీ2 వేరియంట్ ధర రూ. 1,19,999 గా (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) నిర్ణయించారు. ఏఐ ఆధారిత కనెక్టెడ్ ఫీచర్లు, మోడ్యులర్ ఇంజినీరింగ్, రోజువారీ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ట్రయాన్ లైనప్‌ను మూడు వేరియంట్ల (సీ1, సీ1ఎక్స్, సీ2)లో తీసుకొచ్చారు.

సీ1 వేరియంట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​లోని ఈ వ...