భారతదేశం, జూన్ 15 -- Toyota Hyryder 7 Seater : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ లవర్స్ కోసం జపాన్ కార్ల తయారీ దిగ్గజం టయోటా ఒక అదిరిపోయే అప్‌డేట్ మోడల్‌ను ప్లాన్ చేస్తోంది. టయోటా కంపెనీకి చెందిన మొట్టమొదటి మిడ్-సైజ్ ఎస్‌యూవీగా భారత్‌లో అడుగుపెట్టిన 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్'కు ఇక్కడ భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మారుతీ సుజుకీ భాగస్వామ్యంతో వస్తున్న కార్లలో ప్రస్తుతం ఇదే టయోటా బ్రాండ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాతో కలిసి గ్లోబల్ సీ ప్లాట్‌ఫారమ్, ఇంజన్‌ను పంచుకున్నప్పటికీ.. హైరైడర్ తనదైన ప్రత్యేక శైలి, నమ్మకంతో మార్కెట్లో ఒక బలమైన ముద్ర వేసుకుంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ, టయోటా ఇప్పుడు ఈ పాపులర్ ఎస్‌యూవీలో 'త్రీ-రో' లేదా 7-సీటర్ వర్షన్‌ను తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దేశీయ రోడ్లపై...