భారతదేశం, ఆగస్టు 20 -- Tollywood: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ 'దేవర', పవన్ కళ్యాణ్ 'ఓజీ', ప్రభాస్ 'రాజా సాబ్', రామ్ చరణ్ 'పెద్ది' లాంటి బిగ్ స్టార్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌కి సిద్ధార్థ్ "Oops" అని కామెంట్ చేసి తెలుగు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

'పఠాన్', 'వార్' లాంటి యాక్షన్ హిట్స్ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ఈ 'ఊప్స్' కామెంట్ నెట్టింట గంటల వ్యవధిలోనే విపరీతంగా వైరల్ అయింది. వివాదం ముదరడంతో ఆయన వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ, టాలీవుడ్ అభిమానులు మాత్రం స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్లతో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు.

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌లతో...