భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏప్రిల్ 21, మంగళవారం నాటి గ్రహ గతులను గమనిస్తే, పలు రాశుల వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. మంగళవారం అంటేనే భక్తులకు పరమ పవిత్రం, అందునా ఆంజనేయ స్వామిని ఆరాధించే రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడిని వేడుకుంటే రోగ భయం, మానసిక ఆందోళనలు, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని ప్రతీతి.

ఈ రోజు మేష రాశి వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ నైపుణ్యంతో వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికిరాదు, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి. ఎండల తీవ్రత దృష్ట్యా సరైన నిద్ర, విశ్రాంతి అవసరం. డిజిటల్ స్క్రీన్ల వాడకాన్ని తగ్గించండి.

వృషభ రాశి వారు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. ఖర్చుల వ...