భారతదేశం, మే 12 -- Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠం తిరుమలకు ముఖద్వారమైన తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మే 31 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మే 22వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ (TTD) ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్ట్, హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీత సభలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్స...