భారతదేశం, సెప్టెంబర్ 9 -- Tirumala Srivari Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. స్వామివారి దివ్య దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేపడుతున్నాయి.

ఈ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పనులపై చర్చించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలల...