భారతదేశం, ఏప్రిల్ 20 -- కలియుగంలో ప్రజలను రక్షించడానికి విష్ణు స్వయంగా వెంకటేశ్వర స్వామి అవతారాన్ని ఎత్తాడు. భక్తులు "గోవిందా గోవిందా" అని జపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని బలంగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలసినారు. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే ఆలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి.

ఇక్కడ తలనీలాలు సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథోత్సవం వంటివి జరుపుతారు. వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కల...