భారతదేశం, ఆగస్టు 20 -- The Monster: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన సంచలన అప్‌డేట్ బయటికొచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మేకర్స్ 'ది మాన్‌స్టర్' (The Monster) అనే క్రేజీ టైటిల్‌ను లాక్ చేశారు.

ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ ప్రొడక్షన్ వర్గాల్లో ఈ టైటిల్ దాదాపు ఖాయమైపోయింది. సల్మాన్ ఖాన్ సరసన సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో 'బృందావనం', 'ఎవడు', నాగార్జున-కార్తీల 'ఊపిరి', మహేష్ బ...