భారతదేశం, మార్చి 14 -- తమిళ నటి రాధికా శరత్‌కుమార్ నటించిన కామెడీ డ్రామా ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. స్టార్ హీరోలు లేకుండా, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చిన 'థాయ్ కిళవి' (గాడ్‌మదర్) 2026లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడా మూవీ ఓటీటీలోకి రాబోతుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

థాయ్ కిళవి మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైంది. రెండు వారాలకుపైగా బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు అందరి కళ్లూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పైనే ఉన్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మార్చి చివరి వారంలో అంటే మార్చి 26న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో బజ్ నెలకొంది. జియోహాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల...