భారతదేశం, ఏప్రిల్ 10 -- సర్ ప్రైజింగ్ హిట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమిళ సినిమా 'థాయ్ కిళవి' ఓటీటీలోకి వచ్చేసింది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు నుంచి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా వచ్చిన 'థాయ్ కిళవి' బాక్సాఫీస్ ను షేక్ చేసింది. థియేటర్లలో సత్తాచాటింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన సినీ లవర్స్ ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. థాయ్ కిళవి మూవీ శుక్రవారం (ఏప్రిల్ 10) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది.

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ థాయ్ కిళవి మూవీని తెలుగులోనూ చూడొచ్చు. ఈ మూవీ ఇవాళ నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ కు ...