భారతదేశం, ఫిబ్రవరి 25 -- తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 14 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే హాల్ టికెట్ల ఎప్పుడు వస్తాయని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అధికారుల నుంచి వచ్చాయి.

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు 2,676 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి పరీక్షలకు 5,17,727 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 11,674 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక పదో తరగతి హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల కానున్నాయి. అయితే 5వ తేదీన అందుబాటులోకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్...