భారతదేశం, ఏప్రిల్ 28 -- ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుంచి 12.06.2026 వరకు జరుగుతాయి. అయితే అభ్యర్థులు పరీక్ష ఫీజను సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించడానికి గడువు తేదీని 14.05.2026గా నిర్ణయించారు. హెడ్‌మాస్టర్లు ఈఎన్ఆర్‌ను ఆన్‌లైన్ ద్వారా డీఈవోకు సమర్పించడానికి చివరి తేదీ 15.05.2026గా ఉంది. డీఈఓలు ఈఎన్ఆర్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్‌లైన్ ద్వారా సమర్పించడానికి గడువు తేదీ 16.05.2026గా ఉంది. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలది హవా కొనసాగింది. మెుత్తం ఉత్తీర్ణత శాతం చూసుకుంటే.. 95.15 శాతంగా ఉంది. బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 96.26 శాతంగా ఉన్నారు. ఈసారి కూడా బాలికలదే హవ...