భారతదేశం, మే 7 -- Telugu OTT: లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ 'తిమ్మరాజుపల్లి టీవీ' ఓటీటీలోకి వచ్చేస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఊర్లో ఉన్న ఒకే ఒక్క టీవీ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది.

విలేజ్ కామెడీ డ్రామా 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఈ చిత్రం మే 15, 2026 న ఓటీటీలో అడుగుపెట్టనుంది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో ఈ తిమ్మరాజుపల్లి టీవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో గురువారం (మే 7) అనౌన్స్ చేసింది.

''ఒక టీవీ మిస్సింగ్. ఒక దొంగపై నింద. నిజం కోసం ఎదురు చూసే ఒక గ్రామం. తిమ్మరాజుపల్లి టీవీ మే 15న ఆహాలో ప్రీమియర్ కానుంది. ఆహా గోల్డ్ యూజర్లు 24 గంటల ముందే చూడొచ్చు'' అని ఆహా వీడియో పోస్టు చేసింది.

హీరోగా వరుస సిని...