భారతదేశం, మే 12 -- Telangana Exhibitors: తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తు, వాటి పునరుద్ధరణ కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మంగళవారం (మే 12) కీలక సమావేశం నిర్వహించింది. ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ తదితరులు ఈ భేటీలో పాల్గొని, థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై చర్చించారు.

సమావేశం అనంతరం నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నిర్మాత తండ్రి అయితే.. ఎగ్జిబిటర్ బిడ్డ లాంటివాడు. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2025లో పరిస్థితి మరీ దిగజారింది. గత ఆరు నెలలుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. థియేటర్లు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్య...