భారతదేశం, జూన్ 25 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాల పాటు శాసించిన ఐకానిక్ కార్లలో 'టాటా సుమో' ఒకటి! ఇప్పుడు ఇదే బ్రాండ్ నేమ్‌ను సరికొత్త ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి టాటా మోటార్స్ తెరవెనుక వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లో 6 సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న మోడళ్లకు 20కి పైగా ఫేస్‌లిఫ్ట్‌లు, అప్‌డేట్లను తీసుకురానున్నట్లు టాటా ఇప్పటికే ప్రకటించింది. ఈ కొత్త వ్యూహంలో భాగంగానే.. కంపెనీ ఇప్పటివరకు లేని సరికొత్త విభాగాల్లోకి ప్రవేశించనుంది! అందులో అత్యంత ముఖ్యమైనది.. 3-రో ఎంపీవీ విభాగం.

ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. టాటా మోటార్స్ ఒక సరికొత్త ఎస్‌యూవీ స్టైల్ 3-రో (మూడు వరుసల సీటింగ్) వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది అటు కమర్షియల్ (ట్రావెల్స్), ఇటు ప్...