భారతదేశం, మార్చి 7 -- నెల రోజులుగా క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచకప్ 2026 ఎండింగ్ కు వచ్చేసింది. రేపే (మార్చి 8) గ్రాండ్ ఫైనల్. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్ ను ఇండియా ఢీ కొడుతుంది. అయితే ఈ ఫైనల్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది.

మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచకప్ క్లోజింగ సెర్మనీకి గ్లోబల్ లెవల్ టచ్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ లో గ్లోబల్ పాప్ స్టార్, గ్రామీ అవార్డు విన్నర్ రికీ మార్టిన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. తన సాంగ్స్ తో అతను స్టేడియాన్ని ఊపేసేందుకు రెడీ అవుతున్నాడు.

టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీలో రికీ మార్టిన్ తో పాటు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ప్రదర్శన ఇవ్...