భారతదేశం, మార్చి 8 -- ఇదీ ఇండియా పవర్ అంటే.. ఇది కదా భారత క్రికెట్ సత్తా అంటే.. సొంతగడ్డపై మన క్రికెట్ టీమ్ అదరగొట్టింది. వరుసగా రెండో సారి, మొత్తంగా మూడో సారి టీ20 ప్రపంచకప్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించి, ఇండియా హీరోలుగా మారిన ఆటగాళ్ల గురించి తెలుసుకోండి.

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సంజు శాంసన్ గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు శాంసన్. ఫస్ట్ ఫైనల్ ఎలెవన్ లోనే లేని శాంసన్.. టీమ్ డిఫరెంట్ కాంబినేషన్ ప్లాన్ కారణంగా జట్టులోకి వచ్చాడు. 5 ఇన్నింగ్స్ ల్లో 321 రన్స్ తో టీమ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషంచాడు. ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక రన్స్ చేసింది అతనే.

ఈ పొట్టి కప్ లో డైనమైట్ లా పేలాడు ఇషాన్ కిషన్. కొన్ని నెలల కిందట వరకూ అసలు ఇండియా ట...