భారతదేశం, మార్చి 2 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 961 పాయింట్లు పడి 81,287 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 318 పాయింట్లు కోల్పోయి 25,179 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 659 పాయింట్లు పడి 60,529 వద్దకు చేరింది.

శనివారం ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్​లు సంయుక్త దాడులు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,536.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,292.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే ...