భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న వేళ విద్యార్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

పదో తరగతి పరీక్షల వేళ చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొవటంతో పాటు పరీక్షలను రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పలు సూచనలు చేశారు. అవెంటో ఇక్కడ తెలుసుకోండి..

విద్యార్థి జీవిత ప్రయాణంలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమని కలెక్టర్ రిజ్వాన్ భాషా అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలు భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపిస్తాయని. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో కృషి చేస్తే విజయం మీ సొంతమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా "సప్త సూత్రాలు"ను పేర్కొన్నారు. అవెంటో ఇక్...