భారతదేశం, ఆగస్టు 24 -- SS Rajamouli: వర్సటైల్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై దర్శకధీర ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ రివ్యూ ఇచ్చారు. సినిమా చాలా హృద్యంగా, కూల్‌గా ఉందంటూ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీ-ట్వీట్ చేస్తూ.. "దయచేసి ఈ సినిమాను రాజమౌళి గారికి చూపించి ఆయన ఓపినియన్ చెప్పు బ్రో" అని కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సూర్య నటనపై ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. "విశ్వనాథ్ అండ్ సన్స్ చాలా బ్యూటిఫుల్‌గా, మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంత హాయిగా, మనసును మైమరిపించే ఎంటర్‌టైనర్ చూసి చాలా కాలమైంది" అని కార్తికేయ కొనియాడారు.

మనం ఎంతో ఇష్టపడే ఆ పాత వింటేజ్ జోన్‌లో ...